నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:43

ఓపెన్ స్కూల్ చదివితే DSC కి నో ఛాన్స్

తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియా మక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

వీళ్లు గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన ప్పటికీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించి నట్లు సమాచారం.

తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికం గా ఉత్తర్వులు ఇవ్వనున్నా రు.

విద్యాశాఖ తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది అభ్యర్ధులు డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:41

నేడు మంథని లోని ఆలయాల హుండీ లెక్కింపు

మంథని పట్టణానికి చెందిన మూడు ప్రముఖ ఆలయాల హుండీలు ఈరోజు లెక్కించ నున్నట్లు ఆలయాల ఎండో మెంట్ మేనేజర్ రాజ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

మంథని పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం హుండి ఉదయం 10. 30 గంటలకు,

శ్రీ మహాలక్ష్మి దేవాలయం హుండి మధ్యాహ్నం 12. 30 గంటలకు,

శ్రీ గౌతమేశ్వర స్వామి దేవస్థానం హుండి మధ్యాహ్నం 3. 30 నిమిషాలకు లెక్కించ నున్నట్లు తెలిపారు..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:40

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది.

విదేశీ మారక ద్రవ్య నిర్వ హణ చట్టం,(ఫెమా ) నిబం ధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకా వాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానికి కూడా సమన్లు పంపింది.

కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరుకాలేదు.

ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసా ల్లో, కార్యాలయాల్లో సోదా లు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడోసారి ఆమెకు సమన్లు జారీ చేసింది.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:39

బాసగూడెం లో ఎన్ కౌంటర్ ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఆరుగురు మృతి

•పోలీసులకు లొంగిపోయిన దళ సభ్యుడు

చర్ల సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లా బాసగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చీపురు బట్టి సమీప తాలి పేరు నది ఒడ్డున బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఆరుగురు మృతి చెందినట్టు బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మృతులను.. మిలీషియా సెక్రటరీ కమాండర్‌ మూక, ఏసీఎం నగేష్‌, అతని భార్య సోనీ, ఏసీఎం మిలీషియా సీప్‌ వికాస్‌, ఏసీఎం గనజి, సుక్కగా పోలీసులు గుర్తించారు.

హోలీ పండుగ రోజు ముగ్గురు గ్రామీణు లను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఆచూకీ కోసం కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్‌ 229 బెటాలి యన్‌, డీఆర్జీ బలగాలు బాసగూడ అడవులను జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో చీపురు బట్టి సమీప అడవిలో మావోయి స్టులు తారసపడి విచక్ష ణారహితంగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఆత్మ రక్షణ కోసం బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు చనిపో యారని తెలిపారు.

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్‌ నెంబర్‌ 10 కమిటీ కమాండర్‌ రమేష్‌, అతని భార్య సోనీ మృతుల్లో ఉన్నారని ఎస్పీ ధ్రువీకరించారు. రెండు మూడు గంటల పాటు ఏకధాటిగా జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఒక దళ సభ్యుడు లొంగిపోగా అనంతరం ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు తుపాకులు, మందు గుండు సామగ్రి, మావోయిస్టుల విప్లవ సాహిత్యం భారీగా లభించిందని ఎస్పీ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 08:13

నేడు ఢిల్లీతో రాజస్థాన్ పోరు

గురువారం ఢిల్లీ క్యాపి టల్స్‌తో జరిగే పోరుకు రాజస్థాన్ రాయల్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లోనూ విజయ మే లక్షంగా పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈమ్యాచ్‌లో గెలిచి శుభా రంభం చేయాలనే పట్టుదల తో ఢిల్లీ కనిపిస్తోంది.

ఇక తొలి మ్యాచ్‌లో లక్నోను అలవోకగా ఓడించిన రాజ స్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిం చాలని భావిస్తోంది. కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కలిగిన శాంసన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం.

ఐపిఎల్ శాంసన్‌కు చక్కటి రికార్డు ఉండడం కూడా రాజస్థాన్‌కు సానుకూలా పరిణామమే. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ల రూపం లో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్‌లో వీరిద్దరూ బాగానే ఆడినా భారీ స్కోర్లను సాధించడంలో విఫల మయ్యారు.

ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో యశస్వి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పరుగుల వరద పారించాడు.

ఐపిఎల్‌లోనూ అదే జోరు ను కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రపంచంలోని అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకరిగా పేరున్న బట్లర్, హెట్‌మెయిర్‌ల రూపంలో రాజస్థాన్‌కు పదునైన అస్త్రాలు ఉండనే ఉన్నాయి...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 08:12

హైదరాబాద్ లో పరుగుల వర్షం కురిపించిన సన్ రైజర్స్

సొంత స్టేడియమైన ఉప్ప‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌కు చిత‌క్కొట్టారు.

నువ్వానేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతూ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో

హోరెత్తించారు. అరం గేట్రంలోనే ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (62) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టి హైద‌రాబ్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

అత‌డి త‌ర్వాత‌ అభిషేక్ శ‌ర్మ‌(63) విధ్వంసం కొన‌సాగించాడు. ఆ తర్వాత క్లాసెన్ (80) వీర బాదుడు బాదాడు. మార్కరామ్ (42) కూడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

దీంతో సన్ రైజ్ హైదరాబాద్ జట్టు స్కోరు నిర్ణిత 20 ఓవర్లకు 277 భారీగా స్కోరు నమోదు చేసింది. దీంతో ముంబైకి 278 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 08:10

నేడు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీ టీసీ సభ్యులు, ఎక్స్‌అఫీషి యో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.

మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తారు.

ఓటింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచ నున్నారు.

ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ నవీన్‌కుమార్‌ రెడ్డి,బీఆర్ఎస్ సుదర్శన్‌ గౌడ్‌,స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 08:09

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో బుధవారం రాత్రి మరోసారి చిరుత కలకలం రేపింది.

తిరుమల శ్రీవారి నడక దారిలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది.

తాజాగా ట్రాప్ కెమరాలు ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు.అటవి శాఖ అధికారులు.

ఈ చిరుత సంచారం నేప థ్యంలో భధ్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది టిటిడి పాలక మండలి. తిరుమల శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భధ్రతా ఏర్పాట్లు చేస్తు న్నారు.

కాగా.. ఇప్పటికే తిరుమల శ్రీవారి నడకదారిలో వన్యప్రాణుల సంచారం చోటు చేసుకుంది. గతే డాది.. ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి.. చంపేసిన సంగతి తెలిసిందే.

నిజంనిప్పులాంటిది

Mar 27 2024, 21:20

ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయడానికి అనుమతి అవసరం లేదు: విద్యాశాఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది.

ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ ఇచ్చారు. టెట్‌ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా

విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి వార్తలు వినిపిం చాయి.

ఈ వార్త ప్రభుత్వ ఉపాధ్యా యుల్లో ఆయోమయానికి దారితీసింది. నిజంగా విద్యా శాఖ ఆ రకమైన ఆదేశాలు జారీ చేసిందా.. లేక ఒట్టి పుకారేనా టీచర్లు తేల్చకోలేకపోయారు.

ఈ క్రమంలో విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

నిజంనిప్పులాంటిది

Mar 27 2024, 21:19

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు.

రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్‌ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతోపాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు..

''కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందిస్తున్నా. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలి. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలి.

సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలి. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి''అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నర్సింహా, జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు..